News January 31, 2025

అన్నమయ్య: ప్రాణం తీసిన ఈత సరదా

image

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్ వెలుగల్లులోని సోలార్ పవర్ ప్లాంట్లో పనిచేసేవాడు. రెండురోజుల క్రితం వెలుగల్లు ప్రాజెక్టు గండిమడుగుకి  ఈతకువెళ్లి గల్లంతయ్యాడు. దీంతో ధీరజ్ కోసం ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, శుక్రవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 21, 2025

సిద్దిపేట: ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యం: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో వివిధ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యమని పగడ్బందీగా రోడ్ భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News November 21, 2025

వరంగల్: భారీగా పడిపోతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం రూ.2,080 ఉన్న మొక్కజొన్న ధర, బుధవారం రూ.2,030కి పడిపోయింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,010 అయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి రూ.15,021 ధర రాగా, దీపిక మిర్చికి రూ.16 వేల ధర వచ్చింది.

News November 21, 2025

Skill Trainingలో సిటీ పోలీస్ బాస్

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా పేట్ల బురుజు, చేలపురా సిటీసీ శిక్షణా కేంద్రాలను సందర్శించారు. హోంగార్డు నుంచి ఎస్సై స్థాయి వరకు 350 మంది సిబ్బంది తీసుకుంటున్న శిక్షణను పరిశీలించారు. “ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” నైపుణ్యాభివృద్ధి శిక్షణ గురించి తెలుసుకున్నారు. ట్రైనింగ్ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.