News January 24, 2025

అన్నమయ్య: ముగ్గురికి జైలుశిక్ష

image

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురికి జైలుశిక్ష పడింది. అన్నమయ్య జిల్లా కేవీపల్లె(M) నూతనకాలువకు చెందిన సంగటి చిన్నయ్య, సహదేవ, వీరభద్ర 2020లో ఎర్రచందనం తరలించారు. అప్పటి ఎస్ఐ సుమన్ వీరిని అరెస్ట్ చేశారు. నేరం నిరూపణ కావడంతో ముగ్గురికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు అన్నమయ్య పోలీసులు తెలిపారు. 

Similar News

News November 15, 2025

రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.

News November 15, 2025

ఖమ్మం: వ్యక్తి మృతి.. అకౌంట్ నుంచి డబ్బు మాయం

image

చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా పలు దఫాలుగా నగదు కాజేసిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. హనుమాన్ నగర్‌కు చెందిన ఆలేటి ప్రసాద్ 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రసాద్‌ ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా కొందరు దుండగులు రూ.3 లక్షలు కాజేశారు. కుటుంబ సభ్యులకు బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా.. అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తం బదిలీ అయిందని చెప్పడంతో షాక్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 15, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* విశాఖ CII సదస్సులో WEF సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
* పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం.. అనంతపురం చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
* గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందన్న మంత్రి గొట్టిపాటి
* చంద్రబాబుపై నమ్మకం లేక కంపెనీలు పెట్టుబడుల్ని భారీగా తగ్గిస్తున్నాయని YCP విమర్శలు