News January 24, 2025
అన్నమయ్య: ముగ్గురికి జైలుశిక్ష

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురికి జైలుశిక్ష పడింది. అన్నమయ్య జిల్లా కేవీపల్లె(M) నూతనకాలువకు చెందిన సంగటి చిన్నయ్య, సహదేవ, వీరభద్ర 2020లో ఎర్రచందనం తరలించారు. అప్పటి ఎస్ఐ సుమన్ వీరిని అరెస్ట్ చేశారు. నేరం నిరూపణ కావడంతో ముగ్గురికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు అన్నమయ్య పోలీసులు తెలిపారు.
Similar News
News November 29, 2025
కామారెడ్డి: రాష్ట్ర స్థాయికి నామినేట్ అయిన 8 పాఠశాలలు

జిల్లా స్థాయిలో SHVR 2025-26 బెస్ట్ రేటింగ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు ఎంపికైనట్లు డీఈవో రాజు తెలిపారు. రూరల్లో TSNR ZPHS బీబీపేట్, ZPHS బోర్లం, ZPHS ధర్మారావుపేట్, PS మహమ్మదాపూర్, PS శక్తి నగర్, UPS ఇస్సన్నపల్లి, అర్బన్లో సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డి, PS INC కామారెడ్డి స్కూల్స్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నామినేట్ అయినట్లు DEO పేర్కొన్నారు.
News November 29, 2025
GDP వృద్ధి.. దేశ పౌరులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త: CBN

2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP 8.2% వృద్ధి చెందడం ప్రతి పౌరుడికి ఉత్సాహాన్నిచ్చే వార్త అని CM CBN అన్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యాల వైపు స్థిరంగా కొనసాగుతోందన్నారు. తాజా వృద్ధి తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు తదితర రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
News November 29, 2025
కామారెడ్డి: నిర్లక్ష్య డ్రైవింగ్ చేసిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడు మహమ్మద్ షమీంకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ 3 నెలల జైలు శిక్ష విధించారు. 2017లో కండేబల్లూర్కు చెందిన కుమ్మరి కుంట నాగయ్య మృతి చెందాడు. అతని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడిని కోర్టు ఎదుట హాజరు పరిచారు.


