News April 12, 2025

అన్నమయ్య: ముగ్గురు బాలురు మృతి

image

ఆడుకోవడానికి ఊరు సమీపంలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి శుక్రవారం ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లికి చెందిన చొక్కరాజు దేవాన్ష్ (5), చొక్కరాజు విజయ్ (4), రెడ్డిచర్ల యశ్వంత్(5) ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 16, 2025

MBNR: విద్యుత్ స్తంభం ఇలాగే ఉండాలా..?

image

మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటి ప్రహరీ గోడలో విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. రెండు నెలల క్రితం ప్రచార మాధ్యమాలలో విషయం వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అది అలాగే ఉండడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన ఉండాల్సిన విద్యుత్ స్తంభం ఇంటి ప్రహరీ గోడలోనే ఉండాలా..? అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

News September 16, 2025

అన్నమయ్య: సన్నిహితులే రాక్షసులు

image

మన చుట్టూ సన్నిహితంగా ఉండే వారే రాక్షసులుగా మారి బాలికల్ని చిదిమేస్తున్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని <<17714750>>మదనపల్లె<<>>, <<17720487>>తంబళ్లపల్లె<<>>లో జరిగిన 2 అత్యాచార ఘటనలు బాలికలపై ఉన్న భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదనే భయాన్ని తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.

News September 16, 2025

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం ‘OG’. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చని సినీ వర్గాలు తెలిపాయి. సినిమా రిలీజ్ తేదీ 25న అర్ధరాత్రి ఒంటి గంటకు లేదా తెల్లవారుజామున 4 గంటలకు షోస్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.