News April 12, 2025
అన్నమయ్య: ముగ్గురు బాలురు మృతి

ఆడుకోవడానికి ఊరు సమీపంలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి శుక్రవారం ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లికి చెందిన చొక్కరాజు దేవాన్ష్ (5), చొక్కరాజు విజయ్ (4), రెడ్డిచర్ల యశ్వంత్(5) ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 17, 2025
iBOMMA కేసు.. పోలీసులపై మీమ్స్ చేస్తే చర్యలు: సజ్జనార్

iBOMMA రవి గురించి మాజీ భార్య సమాచారం ఇచ్చిందన్న వార్తలను HYD CP సజ్జనార్ ఖండించారు. అతని గురించి తమకు ఎవరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, పోలీసులే స్వతహాగా పట్టుకున్నారని స్పష్టం చేశారు. రవి అరెస్టు తర్వాత పోలీసులపై చాలా మంది మీమ్స్ చేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవి మహారాష్ట్ర, ఏపీ నుంచి ప్రహ్లాద్ కుమార్ పేరిట డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు అని చెప్పారు.
News November 17, 2025
21న ఓటీటీలోకి ‘బైసన్’

* చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు.
* హాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన F1 మూవీ DEC 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించారు.
News November 17, 2025
జగిత్యాల: శీతాకాలం.. జిల్లావాసులకు SP సూచనలు

శీతాకాలం మొదలైనందున రహదారులపై పొగమంచు ఎక్కువగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
1. వేగం తగ్గించాలి
2. ఫాగ్లైట్లు- లో బీమ్ ఉపయోగించాలి
3. ముందున్న వాహనానికి దూరం పాటించాలి
4. ఓవర్టేక్ చేయరాదు
5. రోడ్డుపై వాహనాలు నిలపకూడదు
6. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని SP కోరారు.


