News April 2, 2025
అన్నమయ్య యువతికి ఆల్ ఇండియా ర్యాంక్

CA ఫైనల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా యువతి సత్తా చాటింది. తంబళ్లపల్లె(M) కన్నెమడుగుకు చెందిన తేజశ్విని ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అభినందించారు. YCP నాయకులతో కలసి తేజశ్వినిని శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తంబళ్లపల్లె పేరును అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
Similar News
News February 24, 2026
నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్గా, నూరుల్లా ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.
News February 24, 2026
ఖమ్మం: ‘సౌర’ సిరి రూ.12 కోట్లతో సోలార్ ప్లాంట్లు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నాలుగు సోలార్ ప్లాంట్లు మంజూరు కాగా, ఒక్కో ప్లాంట్ను ఒక మెగావాట్ సామర్థ్యంతో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కంలకు విక్రయించి ఆదాయం పొందనున్నారు.
News February 24, 2026
ఉమ్మడి రంగారెడ్డిలో యూరియా నిల్వలు

ఫిబ్రవరి 24 వరకు యూరియా నిల్వల పై ఫెర్టిలైజర్ యాప్ తాజా సమాచారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,71,041 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా వికారాబాద్లో 10,991 బ్యాగులు, రంగారెడ్డిలో 16,809 బ్యాగులు, మేడ్చల్-మల్కాజిగిరిలో 8,263 బ్యాగులు నిల్వలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు అవసరమైన మేరకు బుక్ చేసుకోవాలని సూచించారు.


