News September 5, 2024

అన్నమయ్య: రక్తంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం

image

అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆర్ట్ మాస్టర్ డి ఆనంద్ రాజు, తన రక్తంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వి.వి వరప్రసాద్ సిబ్బంది కలసి ఆర్ట్ మాస్టర్ ఆనంద్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News January 3, 2026

తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

image

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికిపాటి, సుస్మిత కొణిదెల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొననున్నారు.

News January 3, 2026

పాసు పుస్తకాల్లో తప్పులుంటే అర్జీలు ఇవ్వాలి: కలెక్టర్

image

నూతనంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉంటే అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. పాసు బుక్కుల్లో తప్పులు గుర్తించిన రైతులు తహశీల్దార్ లేక వీఆర్వోలకు అర్జీలు ఇస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కాగా నూతనంగా పంపిణీ చేస్తున్న పాసు పుస్తకాల్లోనూ పలు తప్పిదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.

News January 3, 2026

చిత్తూరు: రేషన్ సరకుల కోసం ఆందోళన.!

image

బియ్యం అందరికీ ఇచ్చేవరకు రేషన్ షాప్ తెరవొద్దని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలసముద్రం మండలం మణిపురం చౌకదుకాణం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రతి నెలా 60 నుంచి 70 కార్డులకు బియ్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ గుర్రప్ప నిరసనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.