News February 21, 2025
అన్నమయ్య: రికార్డుల్లో ఆ ఊరే లేదు..!

రికార్డుల్లో పేరే లేని ఊరుంటుందని మీకు తెలుసా? అవును ఇది నిజమే. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం రెవెన్యూ రికార్డుల్లో లేదు. దీంతో గుర్తింపు కార్డుల కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మ్యుటేషన్ చేద్దామనుకున్నా ఆన్లైన్లో చిట్టిబోయనపల్లె వివరాలు కనిపించడం లేదు. రెవెన్యూ గ్రామానికి చెందిన వందలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 17, 2025
ఇండియన్ మ్యూజియంలో ఉద్యోగాలు

కోల్కతాలోని <
News December 17, 2025
జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

ఈ తెగులు వల్ల ఆకులపై లేత ఆకుపచ్చ రంగులో మచ్చలు ఏర్పడి అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ మచ్చ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను పూర్తిగా తొలగించాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 17, 2025
ఇందల్వాయి: కాల్పులు కాదు… రాడ్తో దాడి: పోలీసులు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద నిన్న మహ్మద్ సల్మాన్ అనే లారీ డ్రైవర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రచారం జరగగా నిందితులు రాడ్తో దాడి చేయడంతోనే సల్మాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. పాత కక్ష్యల కారణంగా దాడి చేశారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.


