News December 17, 2024

అన్నమయ్య: రూ.3.5 కోట్ల ఎర్రచందనం సీజ్

image

గుజరాత్‌లోని ఎర్రచందనం గోడౌన్‌పై తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురు అంతర్రాష్ట్ర ప్రధాన స్మగ్లర్లను మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా.. వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసిందని వారు తెలిపారు.

Similar News

News September 16, 2025

TTD టోకెన్ల జారీలో మార్పు

image

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.

News September 16, 2025

చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

image

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.

News September 16, 2025

చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

image

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.