News March 7, 2025
అన్నమయ్య: ‘రేపు పాఠశాలలకు సెలవు లేదు’

మార్చి నెల రెండవ శనివారం అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సెలవు లేదని అన్ని యాజమాన్య పాఠశాలలు విధిగా తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కే.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరంలో 220 పని దినములు తగ్గకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీఈఓ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో అధిక సెలవులు ఇవ్వడం వల్ల వర్కింగ్ డేస్ సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
పాడేరు: ‘1,44,222 మంది రైతులకు పెట్టుబడి సాయం’

రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బుధవారం పాడేరు కాఫీ హౌస్లో వ్యవసాయ శాఖ నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 22మండలాల్లో 1,44,222 మంది గిరిజన రైతులకు ఒక్కొక్కరికి రూ.7వేలు చొప్పున పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
News November 19, 2025
అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News November 19, 2025
కుక్క కాట్లు బాబోయ్.. ఘననీయంగా పెరిగిన సంఖ్య.!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుక్క కాటు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇ సంఖ్య అధికంగా ఉంది. NTR (D)లో గతేడాది 15వేల కుక్క కాటు బాధితులు ఉండగా, ఈఏడాది NOV 17నాటికే 16,893 కేసులు నమోదయ్యాయి. కుక్క కాటుపై అవగాహన పెరగడంతో చిన్న గాయమైనా వెంటనే ఆసుపత్రికి వచ్చి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. NTRలో ప్రస్తుతం 11వేల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.


