News February 22, 2025
అన్నమయ్య: రైతు విభాగం అధ్యక్షుడిగా ఆరంరెడ్డి

వైసీపీ అన్నమయ్య జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా యర్రపురెడ్డి ఆరంరెడ్డి, రాజంపేట నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్కు రామజయచంద్ర, మండల అధ్యక్షుడిగా ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డిని అధిష్ఠానం నియమించింది. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సుండుపల్లెకు చెందిన ఆరంరెడ్డి, రామజయచంద్ర నియమితులవడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 26, 2025
వరుసగా రెండో ఏడాది.. భారత క్రికెటర్లకు నిరాశ!

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్రత్న’ జాబితాలో రెండేళ్లుగా క్రికెటర్లకు చోటు దక్కట్లేదు. తాజాగా గగన్ నారంగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 24 మంది క్రీడాకారుల పేర్లను క్రీడా మంత్రిత్వశాఖకు పంపగా అందులో ఏ ఒక్క క్రికెటర్ లేరు. ఈ ఏడాది మెన్స్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ASIA కప్ గెలవగా.. ఉమెన్స్ టీమ్ తొలిసారి వన్డే WC సాధించింది. అయినా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
News December 26, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

అనకాపల్లి మండలం కొత్తూరు జంక్షన్ వద్ద ఈనెల 24వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై శేషగిరిరావు తెలిపారు. కసింకోట మండలానికి చెందిన పప్పల జ్ఞానేశ్వరరావు (31) ద్విచక్ర వాహనంపై అనకాపల్లి వెళుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని కేజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
News December 26, 2025
జంపన్నా ఈసారి అంతేనా?

మేడారం మహాజాతరను దృష్టిలో పెట్టుకుని జంపన్నవాగుపై ఊరట్టం వద్ద చేపడుతున్న కాజ్వే పనులు నత్తనడకన సాగుతోంది. రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నాయి. గత మినీ జాతరలో కూలిన కాజ్వే మాదిరిగానే ఈసారి కూడా వరద ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక కాజ్వే బదులు శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.


