News February 21, 2025
అన్నమయ్య: ‘వ్యాపారులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి’

బి.కొత్తకోట పట్టణం, రూరల్ పరిధిలోని వ్యాపారులందరూ విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు. మండలంలోని వర్తకులతో సీఐ గురువారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మైనర్లకు బైకులు ఇవ్వరాదన్నారు.
Similar News
News November 24, 2025
GWL: ప్రజావాణిలో ఎస్పీకి 16 ఫిర్యాదులు వెల్లువ

గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా 16 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పొలానికి సంబంధించినవి 7, గొడవలకు 2, భర్త హరాస్మెంట్కు 2, ప్లాట్ ఇష్యూ, దొంగతనానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయి. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన

ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. సుమారు 250 మంది విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని, క్యాంపస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. లక్షల ఫీజులు చెల్లించినా రుచిలేని భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 24, 2025
SRCL: ‘ప్రజల సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

బాధితుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన ప్రజల నుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


