News February 21, 2025
అన్నమయ్య: ‘వ్యాపారులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి’

బి.కొత్తకోట పట్టణం, రూరల్ పరిధిలోని వ్యాపారులందరూ విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు. మండలంలోని వర్తకులతో సీఐ గురువారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మైనర్లకు బైకులు ఇవ్వరాదన్నారు.
Similar News
News December 21, 2025
గుంటూరు: ప్రేమ పేరుతో వంచన..!

ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇంటర్ అమ్మాయి కొంపముంచింది. గుంటూరుకి చెందిన రాహుల్ అనే యువకుడు విజయవాడకి చెందిన బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వచ్చిన నిందితుడు, బాలికను గుంటూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
News December 21, 2025
INDvsPAK.. భారత్ ఫస్ట్ బౌలింగ్

పాకిస్థాన్తో జరుగుతోన్న అండర్-19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్
☛ సోనీ స్పోర్ట్స్, సోనీలివ్ యాప్లో లైవ్ చూడవచ్చు.
News December 21, 2025
SRD: సర్పంచ్గా 2019లో కొడుకు.. 2025లో తల్లి!

కంగ్టి మండలంలోని ఎడ్లరెగడి తండాలో ఒకే కుటుంబం వరుసగా రెండోసారి సర్పంచ్ పదవిని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2019లో బలిరామ్ సర్పంచ్గా సేవలు అందించగా, తాజా (2025) ఎన్నికల్లో బలిరామ్ తల్లి లంబాడి ఇరికి బాయి సర్పంచ్గా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో గెలిపించిన తండా వాసులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.


