News February 20, 2025

అన్నమయ్య: YS జగన్‌పై కేసు.. వైసీపీ నేత ఫైర్ 

image

మిర్చి రైతుల సమస్యలపై పోతే కేసు పెడతారా? అని ఇదెక్కడి న్యాయమని వైసీపీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సుగవాసి శ్యాంకుమార్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచి పద్ధతి కాదని ఖండించారు. జగన్‌పై కేసు నమోదుపై బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 22, 2025

సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

image

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.

News November 22, 2025

గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం

image

AP: పెళ్లంటే ఆర్భాటం కాదు అర్థం చేసుకోవడమేనని నిరూపించారు ఇద్దరు ఐఏఎస్‌లు. విశాఖ కైలాసగిరి శివాలయంలో నిరాడంబరంగా దండలు మార్చుకుని, తర్వాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి దంపతులయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీపూజ, మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మల వివాహ తంతు ఇలా సింపుల్‌గా పూర్తయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం.

News November 22, 2025

ధాన్యం సేకరణపై అధికారులతో బాపట్ల కలెక్టర్ సమీక్ష

image

బాపట్ల జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియపై జిల్లా, మండల, సచివాలయాల స్థాయి అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణను పూర్తిగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యం సేకరణ గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.