News February 20, 2025

అన్నమయ్య: YS జగన్‌పై కేసు.. వైసీపీ నేత ఫైర్ 

image

మిర్చి రైతుల సమస్యలపై పోతే కేసు పెడతారా? అని ఇదెక్కడి న్యాయమని వైసీపీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సుగవాసి శ్యాంకుమార్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచి పద్ధతి కాదని ఖండించారు. జగన్‌పై కేసు నమోదుపై బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 24, 2025

ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

image

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.

News November 24, 2025

సొసైటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు: కలెక్టర్

image

MHBD జిల్లాలో PACS ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. దంతాలపల్లి, పెద్ద వంగర, కంబాలపల్లి, అప్పారాజుపల్లి, గంగారంలో కొత్త సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీటిలో రాష్ట్రస్థాయి కమిటీ మూడు సొసైటీలకు ఆమోదం తెలిపిందని, మిగిలిన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

News November 24, 2025

BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.