News September 18, 2024

అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు

image

అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News September 14, 2025

రాజమండ్రి: లోక్‌ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారం

image

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్‌‌ఛార్జ్‌ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.

News September 13, 2025

15న యథాతథిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యథాతథిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in తెలియజేయాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రం పీజీఆర్ఎస్‌లో అందజేయాలన్నారు.

News September 13, 2025

ధవళేశ్వరం విచ్చేసిన సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామానికి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేశారు. శనివారం గ్రామంలో జరిగిన మెండా సీతారామయ్య పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పున్నమరాజు వీర్రాజు పాల్గొన్నారు.