News September 18, 2024
అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు

అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
News November 18, 2025
రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
News November 17, 2025
ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.


