News April 4, 2024
అన్నవరం ఆలయానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి!

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హనుమాన్ జంక్షన్కు చెందిన తమ్మిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతి చెందారు. దర్శనానికి అన్నవరం వెళ్లి వస్తుండగా.. తాళ్లూరు శివారు దాబాల వద్ద లారీని వెనక నుంచి వీరి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
Similar News
News January 2, 2026
వంతెనపై బైక్.. గోదావరిలో శవమై తేలిన వేములూరు వాసి!

ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ విషాదాంతమైంది. కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్(38) మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబరు 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 2, 2026
తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.
News January 2, 2026
తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.


