News September 25, 2024

అన్నవరం ప్రసాదానికి నెయ్యి సరఫరాకు గడువు పూర్తి

image

అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ అంశం రాష్ట్రంలో వివాదాస్పదం కావడంతో అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిపై ఆలయ ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది. ఇక్కడ ఏడాదికి 2 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో నెయ్యికి రైతు డెయిరీకి రూ.538.60 చెల్లిస్తున్నారు.

Similar News

News October 25, 2025

ప్రాథమిక రంగానికి ఊతం ఇవ్వాలి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను చురుకుగా ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన పరిశ్రమల-ఎగుమతుల ప్రోత్సాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ డైరీ & పాల ఉత్పత్తుల పరిశ్రమలు, మత్స్య శాఖ, ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు.

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.