News June 29, 2024

అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తులకు ఇక్కట్లు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొండ దిగువన ప్రసాదం విక్రయకేంద్రం వద్ద రాత్రివేళ ఏర్పాటుచేసిన లైట్ల వద్దకు పురుగులు రావడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కనీసం లైట్లు కూడా ఆపట్లేదని వాపోతున్నారు. కౌంటర్ నుంచి ప్రసాదం ప్యాకెట్లు తీసుకునే సమయంలో పురుగుల కారణంగా అసౌకర్యానికి గురవతున్నామని చెబుతున్నారు.

Similar News

News November 9, 2025

సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

image

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 9, 2025

తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

image

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.

News November 8, 2025

తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

image

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.