News August 9, 2024
అన్నవరం సత్యదేవుని ఆలయంలో బంగారు ధ్వజస్తంభం

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో బంగారు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో రూ.2 కోట్ల వ్యయంతో స్తంభానికి బంగారు తాపడాన్ని తయారు చేయించారు. ఇక గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకొచ్చిన 60 అడుగుల నారేప కర్రతో ఈ స్తంభాన్ని తయారుచేశారు. దాదాపు 300 కేజీల రాగిపై సుమారు 1800 గ్రాముల బంగారు తాపడాన్ని ఏర్పాటు చేశారు.
Similar News
News December 7, 2025
రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.
News December 7, 2025
నేర నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లాలో 317 మందిపై రౌడీషీట్లు తెరిచినట్లు ప్రకటించారు. 19 మందిపై పీడీ యాక్ట్, పలువురిపై పీఈటీ ఎన్ఏఎస్ నమోదు చేశామని, 432 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమన్నారు.


