News August 9, 2024
అన్నవరం సత్యదేవుని ఆలయంలో బంగారు ధ్వజస్తంభం

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో బంగారు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో రూ.2 కోట్ల వ్యయంతో స్తంభానికి బంగారు తాపడాన్ని తయారు చేయించారు. ఇక గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకొచ్చిన 60 అడుగుల నారేప కర్రతో ఈ స్తంభాన్ని తయారుచేశారు. దాదాపు 300 కేజీల రాగిపై సుమారు 1800 గ్రాముల బంగారు తాపడాన్ని ఏర్పాటు చేశారు.
Similar News
News July 6, 2025
పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.
News July 5, 2025
పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.
News July 5, 2025
కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్ను సంప్రదించాల్సిందిగా కోరారు.