News September 8, 2024
అన్నారం షరీఫ్ దర్గాలో అక్రమ వసూళ్లు!

అన్నారం షరీఫ్ యాకూబ్ బాబా దర్గాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందన భక్తులు మండిపడుతున్నారు. టెండర్ దారులు సొంత రశీదు టిక్కెట్లు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కందూరు చేయాలంటే రూ.2వేలకు పైగానే చెల్లించుకోవాల్సిందేనని వాపోతున్నారు. దర్గాలో భక్తుల నుంచి బలవంతంగా కానుకల పేరిట వసూలు చేస్తున్నారని, ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. మీరూ వెళ్తే కామెంట్ చేయండి.
Similar News
News October 20, 2025
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: వరంగల్ కలెక్టర్

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025
వరంగల్: 23 వరకు గడువు.. 27న డ్రా

బీసీ బంద్, బ్యాంకుల బంద్తో మద్యం షాపునకు దరఖాస్తులు వేసే ఉత్సాహకులు రాలేకపోయామని, వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు పెంచుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.
News October 17, 2025
వరంగల్: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.