News February 18, 2025

అన్ని ఏర్పాట్లు చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. దివ్యాంగ ఓటర్లకు ఇబ్బందులు రాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్, ర్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News November 21, 2025

అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

image

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

News November 21, 2025

ఎనుమాముల మార్కెట్‌లో పత్తి ధర ఎంతంటే..?

image

గురువారం అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలి రాగా ధర ఆశించిన స్థాయిలో రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.6,850 పలికింది. ధరలు పెరిగేలా వ్యాపారులు, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News November 21, 2025

రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

image

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.