News July 30, 2024
‘అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి’
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరగా అమలు చేయాలన్నారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తేనే మహిళలకు పథకం వర్తిస్తుందన్నారు. ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పథకాన్ని అమలు చేయాలన్నారు.
Similar News
News September 30, 2024
లడ్డూలా దొరికిపోయిన బాబు: అంబటి రాంబాబు
తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు!’ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది.
News September 30, 2024
US కాన్సులేట్ ప్రతినిధులతో మంత్రి అనిత సమావేశం
రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై హోం మంత్రి చర్చించారు. అమెరికా వెళ్లాలనుకునే వారు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని అన్నారు. వీసా అప్లికేషన్ సిస్టం సులభతరం చేయవలసిందిగా హోమ్ మంత్రి కోరగా యూఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారన్నారు.
News September 30, 2024
గుంటూరు: నేటి నుంచి ఇళ్లకు ఉచిత ఇసుక
గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.