News March 8, 2025
అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు: అన్నమయ్య ఎస్పీ

మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, నాదెళ్ల ద్వారకనాథ్, ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్, డాక్టర్ షణ్ముఖ ప్రియా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రకాశం, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, CTR జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రహదారులు, తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
News December 4, 2025
సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News December 4, 2025
సంక్రాంతి శోభలా మెగా పీటీఎం నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్ను ఈనెల 5న సంక్రాంతి శోభలా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులందరూ సమావేశంలో పాల్గొనే విధంగా చూడాలని ఆమె సూచించారు. ఈ మేరకు విద్యాసంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభ, వారిలో ఉన్న సామర్ధ్యాలను ప్రదర్శించాలన్నారు.


