News March 8, 2025

అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు: అన్నమయ్య ఎస్పీ

image

మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, నాదెళ్ల ద్వారకనాథ్, ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్, డాక్టర్ షణ్ముఖ ప్రియా తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 23, 2025

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: షీ టీం ఎస్ఐ సునంద

image

మహబూబాబాద్ జిల్లా సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మహిళా ఫార్మసీ కళాశాలలో షీ టీం ఎస్ఐ సునంద పలు విషయాలపై శనివారం అవగాహన కల్పించారు. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News March 23, 2025

గేట్‌లో పంగులూరు విద్యార్థికి ఆలిండియా 81 ర్యాంకు

image

2025 సంవత్సరానికి సంబంధించి గేట్ పరీక్షలో పంగులూరు గ్రామానికి చెందిన పుత్తూరి లక్ష్మీ శ్రీ సాయి లోకేశ్‌కు ఆల్ ఇండియా స్థాయిలో 81వ ర్యాంకు వచ్చింది. సాయి లోకేశ్ ఏడో తరగతి వరకు ఒంగోలులో, పదో తరగతి వరకు చిలకలూరిపేటలో, పాలిటెక్నిక్‌ను ఒంగోలులోని దామచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు.

News March 23, 2025

ద్వారకాతిరుమల: కిడ్నాపర్‌కు సహకరించిన వ్యక్తి అరెస్ట్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ద్వారకాతిరుమల మండలానికి చెందిన బాలికను తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు 3 నెలల క్రితం కిడ్నాప్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడితోపాటు మరో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన తెలంగాణ రాష్ట్రం, కలిగోట్‌కు చెందిన సురేశ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.

error: Content is protected !!