News December 23, 2024

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

image

అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లో సర్వ శిక్షా ఉద్యోగుల నిరసనకు హరీష్ రావు మద్దతు పలికి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీసినా స్పందించలేదని పండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కావా అని ప్రశ్నించారు. ఇకనైనా సమగ్ర ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నారు.

Similar News

News December 11, 2025

మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

image

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ‌భారతి లక్పతి నాయక్ ‌ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.

News December 11, 2025

మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

image

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.

News December 11, 2025

మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

image

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.