News August 19, 2024

అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

image

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు. 

Similar News

News December 6, 2025

నేడు అంబేడ్కర్ వర్థంతి.. నారా లోకేశ్ ట్వీట్

image

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేశ్ ‘X’ లో పోస్ట్ చేశారు. ‘దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషిచేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.

News December 6, 2025

‘రహదారి భద్రతా, డిఫెన్సివ్ డ్రైవింగ్’పై శిక్షణ

image

అమరావతి ఇంటిగ్రేటెడ్ అర‍్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) అమలు కార్యకలాపాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కోసం APCRDA కార్యాలయంలో కాంట్రాక్టర్స్ సిబ్బందికి “రహదారి భద్రతా & డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రమాదాలకు గురయ్యే వారి రక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

News December 6, 2025

GNT: గర్భందాల్చిన ఇంటర్ విద్యార్థిని.. యువకుడిపై కేసు నమోదు

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమైన పొట్టిశ్రీరాములునగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. PS నగర్‌కి చెందిన విద్యార్థినికి అదే ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు మాయమాటల చెప్పి లోబరుచుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.