News March 19, 2025

అన్న క్యాంటీన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్

image

నిరుపేదల ఆకలి తీర్చి పేద ప్రజలకు అండగా వుండే అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ పర్యవేక్షించారు. మంగళవారం నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సముదాయంలో నున్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంటీన్లలో రోజువారీగా నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను ఇవ్వాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

Similar News

News December 12, 2025

‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలంటారు పెద్దలు. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

News December 12, 2025

ఇంట్లో ఏ రంగు శివలింగం ఉండాలి?

image

వేర్వేరు రంగుల శివలింగాలకు వేర్వేరు ప్రత్యేక శక్తులుంటాయని పండితులు చెబుతున్నారు. ‘నలుపు: రక్షణ, స్థిరత్వం, ధైర్యాన్ని, తెలుపు: శాంతి, ధ్యానానికి మద్దతు ఇస్తుంది. బంగారు/పసుపు: సంపద, వృత్తిలో పురోగతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ: కొత్త ప్రారంభాలకు సాయపడుతుంది. స్ఫటిక లింగం అతి శుభప్రదం. ఇది సామరస్యం, దైవిక రక్షణను ఆకర్షిస్తుంది. కోరికలకు తగిన లింగాన్ని ప్రతిష్ఠించాలి’ అని సూచిస్తున్నారు.

News December 12, 2025

పంచాయతీ ఎన్నికల్లో 84.28% ఓటింగ్

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. 53.57లక్షల ఓటర్లకు గానూ 45.15లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ 90శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు 3,300 సర్పంచ్, 24,906 వార్డు స్థానాల్లో కౌంటింగ్ పూర్తైంది.