News November 8, 2024

అపార్‌పై నిర్లక్ష్యం తగదు: కర్నూలు కలెక్టర్

image

విద్యార్థులకు అపార్ ఐడీ జనరేట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇదే కొనసాగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపార్ నమోదు కేవం 56% మాత్రమే అయిందన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నారని, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని వేగవంతం చేయాలన్నారు. వారంలోపు 70% మించి నమోదవ్వాలని, అనంతరం సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

Similar News

News February 24, 2026

కర్నూలు: ఇంటర్‌ పరీక్షలకు 297 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 297 మంది విద్యార్థులు హాజరు కాలేదని రీజనల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ లాలప్ప తెలిపారు. మొత్తం 21,147 మంది విద్యార్థులకు గానూ 21,174 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన స్పష్టం చేశారు.

News February 24, 2026

కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

image

మంత్రులు రామానాయుడు, టీజీ భరత్ సమక్షంలో కర్నూలు జిల్లా అభివృద్ధిపై కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ డా.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదికలు సమర్పించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు నాయుడితో జరిగే భేటీ కోసం పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

News February 24, 2026

ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం: SP

image

పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 122 ఫిర్యాదులు అందాయని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని సోమవారం హామీ ఇచ్చారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ఫైనాన్స్ మోసాలు, బంగారు దుకాణ వివాదం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.