News June 22, 2024
అప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్: ధూళిపాళ్ల నరేంద్ర

ఐదేళ్ల పాటు విధ్వంస పాలన సాగించిన జగన్ బీద అరుపులను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ‘ప్రజా వేదిక కూల్చినప్పుడు, నీ ఇంటి కోసం పేదల ఇళ్లు అన్యాయంగా పడగొట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్ రెడ్డి..?. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న నీ పార్టీ ఆఫీసు జోలికి వస్తే గానీ నీకు చట్టం, న్యాయం గుర్తుకురాలేదా..?’ అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.
Similar News
News December 8, 2025
GNT: PGRSలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన PGRSలో SP వకుల్ జిందాల్ ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు, మహిళలు-వృద్ధుల వంటి పలు ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా సంబంధిత స్టేషన్లకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వీల్చైర్లో ఉన్నవారి వరకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించగా, అర్జీలు రాయడంలో సహాయం కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
News December 8, 2025
GNT: అత్యవసర సమయంలో సంజీవిని LOC..!

పేదలకు వైద్య సహాయం కోసం CMRF, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలు ఉపయోగపడుతుంటాయని తెలిసిందే. ఇవి కాక అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) అనే పథకం సంజీవినిలా పని చేస్తుందని చాలా మందికి తెలీదు. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్, నవజాత శిశువుల అనారోగ్యం వంటి వాటికి అత్యవసర చికిత్స కోసం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే బాధితులకు ఈ సాయం అందుతుంది.
News December 8, 2025
PGRS అర్జీల స్థితిని 1100 ద్వారా తెలుసుకోవచ్చు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్సైట్లో లేదా నేరుగా కూడా అందించవచ్చని సూచించారు. కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


