News March 22, 2024

అప్పుడు గల్లా.. ఇప్పుడు పెమ్మసాని

image

టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.

Similar News

News February 26, 2026

డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

image

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.

News February 26, 2026

GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8  తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.

News February 26, 2026

గుంటూరుకు రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 1న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనం, ఏపీ హైకోర్టు నూతన నిర్మాణాల శంకుస్థాపనలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు.