News March 29, 2024

అప్పుడు మాజీ CM కుమార్తె.. ఇప్పుడు మాజీ CM

image

రాజంపేట MP అభ్యర్థిగా మరోసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014, 19లో గెలిచిన ఆయన హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో ఆయన ప్రత్యర్థిగా మాజీ CM ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి పోటీ చేశారు. 2019లో TTD మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ TDP తరఫున బరిలో నిలిచారు. తాజా ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా గెలుపు ఎవరిదో చూడాలి.
#Elections2024

Similar News

News November 25, 2025

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.

News November 25, 2025

మదనపల్లెలోకి పుంగనూరు.. తిరుపతిలోకి నగరి

image

చిత్తూరు జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో చేరుస్తారు. నగరి డివిజన్ మొత్తాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురాన్ని తిరుపతిలో కలిపి.. పాలసముద్రాన్ని చిత్తూరు డివిజన్‌లోకి మారుస్తారని సమాచారం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.

News November 24, 2025

చిత్తూరు: ప్రియురాలిని చంపిన ప్రియుడు.. పరార్.!

image

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన ఇది. స్థానికుల వివరాల మేరకు.. రామసముద్రం(M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ(22) బెంగళూరులో BBA చదువుతోంది. అక్కడ చౌడేపల్లి(M) పెద్దకొండామరికి చెందిన గోవర్ధన్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆదివారం రాత్రి ఆమెను గోవర్ధన్ హత్య చేసి పరారైనట్లు బెంగళూరు తమ్మినహళ్లి PSలో కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.