News March 29, 2024

అప్పుడు మాజీ CM కుమార్తె.. ఇప్పుడు మాజీ CM

image

రాజంపేట MP అభ్యర్థిగా మరోసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014, 19లో గెలిచిన ఆయన హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో ఆయన ప్రత్యర్థిగా మాజీ CM ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి పోటీ చేశారు. 2019లో TTD మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ TDP తరఫున బరిలో నిలిచారు. తాజా ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా గెలుపు ఎవరిదో చూడాలి.
#Elections2024

Similar News

News November 24, 2025

చిత్తూరు: ప్రియురాలిని చంపిన ప్రియుడు.. పరార్.!

image

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన ఇది. స్థానికుల వివరాల మేరకు.. రామసముద్రం(M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ(22) బెంగళూరులో BBA చదువుతోంది. అక్కడ చౌడేపల్లి(M) పెద్దకొండామరికి చెందిన గోవర్ధన్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆదివారం రాత్రి ఆమెను గోవర్ధన్ హత్య చేసి పరారైనట్లు బెంగళూరు తమ్మినహళ్లి PSలో కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2025

చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

image

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్‌పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2025

చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.