News March 29, 2024
అప్పుడు మాజీ CM కుమార్తె.. ఇప్పుడు మాజీ CM

రాజంపేట MP అభ్యర్థిగా మరోసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014, 19లో గెలిచిన ఆయన హ్యాట్రిక్పై కన్నేశారు. 2014లో ఆయన ప్రత్యర్థిగా మాజీ CM ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి పోటీ చేశారు. 2019లో TTD మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ TDP తరఫున బరిలో నిలిచారు. తాజా ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా గెలుపు ఎవరిదో చూడాలి.
#Elections2024
Similar News
News September 15, 2025
కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.
News September 15, 2025
చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.
News September 14, 2025
జిల్లా కలెక్టర్గా తవణంపల్లి వాసి

తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడంతో స్వగ్రామంలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో వారి తల్లితండ్రులు మునెమ్మ, దొరస్వామి రెడ్డి పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు.