News March 20, 2024

అప్పుల బాధతో కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యం

image

కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేట మండలం కొత్త పోలవలస సర్పంచ్ వెంకట శ్యామ్‌కుమార్ బుధవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆయన భార్య ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవల పలువురి నుంచి నగదు అప్పుగా తీసుకుని.. అది తీర్చలేక పోవడంతోనే మనస్తాపం చెంది వెళ్లిపోయారని తెలిపారు.

Similar News

News April 12, 2025

SKLM: ఎస్సీలకు రూ.18.74 కోట్ల ప్రోత్సాహం

image

ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద శ్రీకాకుళం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 450 మంది లబ్ధిదారులకు రూ.18.74 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

News April 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు 23వ స్థానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16,926 మంది పరీక్షలు రాయగా 12,532 మంది పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 23 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18,574 మందికి 11,733 మంది పాసయ్యారు. 63శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది.

News April 12, 2025

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులారా.. GET READY

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!