News May 22, 2024
అప్పుల బాధ ఎక్కువై యువ రైతు ఆత్మహత్య

బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువ రైతు అప్పుల బాధ ఎక్కువై గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళితే.. ప్రవీణ్ కుమార్ వ్యవసాయంలో అప్పులు కావడంతో తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతణ్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు ఆవరించాయి.
Similar News
News October 21, 2025
కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే.!

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.
News October 21, 2025
కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే.!

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.
News October 21, 2025
నేడు పోలీస్ సంస్మరణ దినోత్సవం: SP

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం కడపలో నిర్వహించనున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఉదయం పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొననున్నట్లు చెప్పారు.