News April 12, 2025
అప్పుల భారంతో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

అల్లవరం మండలం తాడికోనకు చెందిన అంగన్వాడీ టీచర్ గెడ్డం నాగమణి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని అల్లవరం ఎస్ఐ తిరుమలరావు శుక్రవారం తెలిపారు. 20 రోజుల క్రితం గడ్డి మందు తాగి సూసైడ్కు పాల్పడిన ఆమెను అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఆమె అప్పులు చేసి కొత్తగా ఇల్లు కట్టిందన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 24, 2025
ఇండియాలో చీపెస్ట్ కార్లు ఇవే..

1.మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు
2.మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3.రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4.టాటా టియాగో: రూ.4.57 లక్షలు
5.మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6.Citroen C3: రూ.4.80 లక్షలు
>పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్వే.
News November 24, 2025
RECORD: ఎకరం రూ.137 కోట్లు

TG: హైదరాబాద్ కోకాపేట్లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.


