News April 12, 2025

అప్పుల భారంతో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

image

అల్లవరం మండలం తాడికోనకు చెందిన అంగన్వాడీ టీచర్ గెడ్డం నాగమణి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని అల్లవరం ఎస్ఐ తిరుమలరావు శుక్రవారం తెలిపారు. 20 రోజుల క్రితం గడ్డి మందు తాగి సూసైడ్‌కు పాల్పడిన ఆమెను అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఆమె అప్పులు చేసి కొత్తగా ఇల్లు కట్టిందన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News October 27, 2025

92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక

image

కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు.

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో ఎవరి పంతం నెగ్గుతుందో..?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయమే కాదు PJR పిల్లల మధ్య కూడా నువ్వానేనా అన్నట్లుగా మారింది. స్థానిక ప్రజలకు PJR అంటే ఎనలేని అభిమానం. కాగా ఆయన కుమారుడు, మాజీ MLA విష్ణువర్ధన్ రెడ్డి BRSలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరనీయనని అంటున్నారు. PJR కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. BRSను ఓడగొడతామంటున్నారు. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.

News October 27, 2025

VKB: ధాన్యం, పత్తి కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

పత్తి, వరి ధాన్యం కొనుగోలను రైతులకు ఇబ్బంది కలగకుండా సరైన విధంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు రైస్ మిల్లర్లకు ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పత్తి, వరి ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.