News February 18, 2025
అభా కార్డుల నమోదు పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని బాపట్ల కలెక్టర్ కలెక్టర్ వెంకట మురళి సోమవారం చెప్పారు. ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 85% సర్వే పూర్తి అయ్యిందన్నారు. వేటపాలెం, కర్లపాలెం, యద్దనపూడి మండలాలలో ఈ ప్రక్రియ జాప్యంపై అరా తీశారు. సత్వరమే నూరు శాతానికి ఈ ప్రక్రియ చేరుకునేలా మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్య అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 21, 2025
నిజాంసాగర్: నవోదయ 6వ తరగతి అడ్మిట్ కార్డులు విడుదల

నిజాంసాగర్ జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల అయినట్లు ప్రిన్సిపల్ సీతారామ్ శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష DEC 13న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
News November 21, 2025
ఎన్కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.


