News February 18, 2025
అభా కార్డుల నమోదు పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని బాపట్ల కలెక్టర్ కలెక్టర్ వెంకట మురళి సోమవారం చెప్పారు. ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 85% సర్వే పూర్తి అయ్యిందన్నారు. వేటపాలెం, కర్లపాలెం, యద్దనపూడి మండలాలలో ఈ ప్రక్రియ జాప్యంపై అరా తీశారు. సత్వరమే నూరు శాతానికి ఈ ప్రక్రియ చేరుకునేలా మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్య అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 20, 2025
ఎన్టీఆర్: పత్తి రైతులపై సీసీఐ నిర్లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏ కేంద్రంలోనూ కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఏ.కొండూరు, గంపలగూడెంలో కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు పత్తి తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,710 – 8,110గా ఉన్నా దళారుల చేత తక్కువకు కొనిపించి లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
News November 20, 2025
వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.
News November 20, 2025
నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్ కోసం వేచి ఉండండి.


