News January 31, 2025

అభివృద్ధికి నిధులివ్వండి: బండారు శ్రావణి

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం చంద్రబాబును కలిశారు. నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్ పనుల గురించి వివరించారు. వాటికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు వివరించారు.

Similar News

News December 5, 2025

వారి కోసం ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలి: MP పుట్టా

image

తప్పిపోయిన వ్యక్తుల కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలని కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. ప్రతిఏటా దేశంలో 8-9 లక్షల మంది వ్యక్తులు తప్పిపోతున్నారని, వారిలో పిల్లలు, మహిళలు అధికంగా ఉంటున్నారని, మహిళలను వేగంగా గుర్తించకపోతే అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

News December 5, 2025

మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

image

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్‌ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 5, 2025

1000 ఇండిగో సర్వీసులు రద్దు.. సారీ చెప్పిన CEO

image

విమానాలు ఆలస్యంగా నడవడం, పలు సర్వీసుల రద్దుతో ఇబ్బందిపడిన వారందరికీ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. విమాన సేవల్లో అంతరాయాన్ని అంగీకరిస్తున్నామని, 5 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ సమాచారం అందుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని కోరారు. నేడు వెయ్యికిపైగా సర్వీసులు రద్దవగా, సంస్థ తీసుకుంటున్న చర్యలతో రేపు ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది.