News February 5, 2025

అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి సవిత

image

త్వరలో రూ.8 కోట్లతో బూదిలి వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. బుధవారం మంత్రి మేరెడ్డిపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఇప్పటికే గోరంట్ల మండలంలో రూ.6 కోట్ల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. గోకులాల షెడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

Similar News

News December 10, 2025

నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

News December 10, 2025

బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

image

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News December 10, 2025

ఆదోని జిల్లా సాధనకు నేడు బంద్.. వైసీపీ మద్దతు

image

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. నేడు జరగబోయే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం పూర్తిగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధనకు వైసీపీ తరఫున మద్దతు తెలుపుతూ జిల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.