News September 25, 2024
అభివృద్ధిలో మాగుంట కుటుంబానికి చెరగని ముద్ర: మంత్రి

మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతమ్మ ఒంగోలు ఎంపీగా నాడు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం చెరగని ముద్ర వేసిందని అన్నారు. మాగుంట పార్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Similar News
News December 10, 2025
ప్రకాశం జిల్లాలో 2కు చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. వారం రోజుల వ్యవధిలో స్క్రబ్ టైఫస్తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గతంలో ఇదే వ్యాధి లక్షణాలతో ఎర్రగొండపాలెం మండలంలో ఓ మహిళ మృతి చెందగా.. తాజాగా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన మహిళ మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. అయితే స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అవసరం లేదని.. అవగాహన అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
News December 10, 2025
ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

☛ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి
☛ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్లను అనుమతించరు
☛ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్లో లేకుంటే డీఈవోను సంప్రదించాలి
☛ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని.లు అదనపు సమయం
☛ హాల్ టికెట్పై నో ఫొటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం
☛ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు
☛ గ్రీవెన్స్ సెల్ : 9848527224.
News December 10, 2025
ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

➡️ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి➡️ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్ లను అనుమతించరు➡️ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్ లో లేకుంటే డీఈఓను సంప్రదించాలి➡️ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని,లు అదనపు సమయం➡️ హాల్ టికెట్ పై నో ఫోటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫోటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం➡️ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు➡️ గ్రీవెన్స్ సెల్ : 9848527224


