News March 17, 2025

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించం: మంత్రి పొంగులేటి

image

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పేదల కలలను సాకారం చేస్తూ మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టేవిధంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు.

Similar News

News March 18, 2025

మార్చి18 : చరిత్రలో ఈ రోజు

image

*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మాగాంధీకి 6 సంవత్సరాల జైలుశిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1953: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1986: సినీనటుడు సుశాంత్ జననం

News March 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 18, 2025

సూర్యాపేట: పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు స్క్వాడ్ విధులు 

image

మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్‌గా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులకి విధులు కేటాయించామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు అందరూ తప్పకుండా పరీక్ష విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వీవీ.అప్పారావు, డీఎంహెచ్‌వో కోటాచలం, డీఈవో అశోక్ ఉన్నారు.

error: Content is protected !!