News March 17, 2025

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించం: మంత్రి పొంగులేటి

image

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పేదల కలలను సాకారం చేస్తూ మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టేవిధంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు.

Similar News

News November 15, 2025

కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News November 15, 2025

ఏలూరు యువతకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

image

ఏలూరు జిల్లా యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు శుక్రవారం తెలిపారు. రెండేళ్ల కాంట్రాక్టుతో ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. డిప్లొమా పూర్తి చేసి, వెల్డింగ్‌లో పదేళ్ల అనుభవం ఉన్న 45 ఏళ్లలోపు వారు అర్హులు. ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in/user-registration?page=program-registration వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

News November 15, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు రోజుల్లోనే రూ.3,540 తగ్గడం విశేషం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,800 పతనమై రూ.1,14,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.