News February 12, 2026

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.54.80 కోట్ల నిధుల్లో 42 పనులకు ఆమోదం లభించగా, 11 పనులు రూ.6.62 కోట్లతో పూర్తయ్యాయన్నారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. తాగునీటి చెరువులు, రహదారులు, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News March 16, 2026

ADB: ఇంటర్ అమ్మాయిలకు మంచి అవకాశం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 65 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

News March 16, 2026

WGL: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

WGL(D) ఖానాపూర్(M)లోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రసాద్ బాలికను బైక్‌పై కిరాణాషాప్‌కు తీసుకెళ్లి చాక్లెట్ ఇచ్చి సమీప చెరువువద్దకు తీసుకెళ్లి దురాగతానికి ప్రయత్నించినట్లు సమాచారం. బాలిక అరవడంతో సమీపంలోని రైతులు గమనించగా నిందితుడు బాలికను ఇంటివద్ద వదిలివెళ్లిపోగా పోలీసులు దర్యాప్తుచేపట్టారు. పోక్సో కేసు నమోదైంది.

News March 16, 2026

మండుతున్న ఎండలు.. పెంట్లవెల్లిలో 38.6°C

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా పెంట్లవెల్లిలో 38.6°C ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట, కల్వకుర్తిలో 38.5°C, తాడూర్‌లో 38.4°C గా రికార్డయ్యాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.