News February 28, 2025

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: నక్కా ఆనందబాబు

image

రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారని మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదాయం, అప్పులు బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తల్లికి వందనం పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,407 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.

Similar News

News November 12, 2025

NIT సమీపంలో ఛాతి నొప్పితో వ్యక్తి మృతి

image

NIT సమీపంలో ఛాతి నొప్పితో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న ఓ ప్యాసింజర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో తన కుమారుడికి ఫోన్ చేశారు. వెంటనే నెక్స్ట్ స్టేజీ వద్ద దిగి ఆసుపత్రికి వెళ్లమని కుమారుడు సలహా ఇవ్వడంతో కాజీపేటలో ట్రైన్ దిగి ఆటోలో ఆసుపత్రికి వెళుతుండగా ఎన్ఐటీ సమీపంలో నొప్పి ఎక్కువై మరణించాడని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News November 12, 2025

జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

image

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్‌ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్‌, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్‌ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

News November 12, 2025

HYD: రోడ్లపై రేగే దుమ్ము వల్లే 32% పొల్యూషన్..!

image

HYD నగరంలో సూక్ష్మ ధూళికణాల కారణంగా జరుగుతున్న కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా స్టడీ చేసింది. అయితే రోడ్లపై రేగే దుమ్ము కారణంగానే 32% పొల్యూషన్ జరుగుతుందని, వాహనాల ద్వారా 18%, ఆర్గానిక్ పదార్థాల వల్ల 16%, బర్నింగ్ బయోమాస్ వల్ల 11 శాతం జరుగుతున్నట్లు తెలిపింది. పరిశ్రమల వల్ల 5 శాతం పొల్యూషన్ జరుగుతుందని పేర్కొంది.