News February 28, 2025
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: నక్కా ఆనందబాబు

రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారని మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదాయం, అప్పులు బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తల్లికి వందనం పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,407 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీ బైపోల్.. 20.76శాతం పోలింగ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76శాతం ఓటింగ్ నమోదైంది. మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రీప్లేస్ చేసినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అటు నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో తిరుగుతున్న ముగ్గురు నాన్లోకల్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు బిహార్లో ఉ.11 గంటల వరకు 31.38శాతం పోలింగ్ నమోదైంది.
News November 11, 2025
గవర్నర్ కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే..!

గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ కర్నూలు పర్యటన ఖరారయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం నగరంలోని మాంటిస్సోరి విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో కలిసి పాల్గొననున్నారు.
News November 11, 2025
HYD: నిర్మాణంలో ఉన్న అందెశ్రీ ఇల్లు ఇదే..!

ఘట్కేసర్ మున్సిపాలిటీ NFC నగర్లో కవి అందెశ్రీ నిర్మించుకుంటున్న ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. 348 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న G+3 భవనం నిర్మాణ దశలో ఉంది. ఇల్లు నిర్మించే స్థోమత లేక లాలాపేటలోని ఇరుకు ఇంట్లో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ ఆర్థిక సహాయం చేయడంతో గృహ నిర్మాణం ప్రారంభమైంది. పనులను స్వయంగా పర్యవేక్షించేవారు. కలల సౌధం పూర్తికాకముందే అందెశ్రీ కాలం చేశారు.


