News February 28, 2025

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: నక్కా ఆనందబాబు

image

రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారని మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదాయం, అప్పులు బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తల్లికి వందనం పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,407 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.

Similar News

News November 27, 2025

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది.

News November 27, 2025

వేములవాడ ఆలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో కేవలం శానిటేషన్ విభాగం సిబ్బందికి మాత్రమే ఈ విధానం అమలులో ఉండగా, కొత్తగా ఆలయ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు వేసుకునే పద్ధతిని ప్రారంభించారు. కాగా, ఆలయ ఈవో రమాదేవి బయోమెట్రిక్ హాజరు పనిచేస్తున్న తీరును గురువారం పరిశీలించారు.

News November 27, 2025

సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

image

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.