News February 28, 2025

అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా రాష్ట్ర బడ్జెట్: కొల్లు రవీంద్ర

image

రాష్ట్ర పునః నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమన్నారు.

Similar News

News October 25, 2025

కృష్ణా: సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్

image

శబ్ద, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం కలెక్టరేట్‌కు సైకిల్ పై వచ్చారు. ప్రతి శనివారం కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు కలెక్టర్ జిల్లా అధికారులంతా సైకిల్‌పై రావాలని గత వారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే శనివారం ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్‌కు సైకిల్‌పై వచ్చారు. పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు సైకిళ్లపై కార్యాలయానికి వచ్చారు.

News October 25, 2025

వర్షాలకు జిల్లాలో 316 హెక్టార్ల వరి పంట నష్టం

image

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన అంచనా వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 316 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయి. మచిలీపట్నం మండలంలో 33.6 హెక్టార్లు, పెడన మండలంలో 101 హెక్టార్లు, గూడూరు మండలంలో 20 హెక్టార్లు, కంకిపాడు మండలంలో 17 హెక్టార్లు, తోట్లవల్లూరు మండలంలో 8 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు అధికారులు పేర్కన్నారు

News October 25, 2025

నేడు కలెక్టరేట్‌లో వాహనాలకు నిషేధం

image

శబ్ద, వాయు కాలుష్య నివారణలో భాగంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున వాహనాలపై నిషేధం విధించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కాలినడకన లేదా సైకిల్‌పై విధులకు హాజరు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి మోటారు వాహనాలకు ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.