News August 7, 2024

అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించిన మంత్రి నారాయణ

image

అమరావతిలో గత ఐదేళ్లుగా ఏపుగా పెరిగిన ముళ్లపొదలను జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటలతో అమరావతికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. 30 రోజుల్లోగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి కోసం 38 రోజుల్లోనే 34 వేలు ఎకరాలు రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారన్నారు.

Similar News

News April 10, 2026

నెల్లూరు: ఫొన్ కాల్‌తో ప్రాణాలను కాపాడిన పోలీసులు

image

కుటుంబ కలహాల నేపథ్యంలో దగదర్తి మండలం తురుమెళ్ల పంచాయతీ లక్ష్మి నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. కుటుంబ సభ్యులు 112 కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే దగదర్తి ఎస్సై జంపాని కుమార్ తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని మొబైల్ నంబర్, లొకేషన్ ఆధారంగా కనుగొని అతని ప్రాణాలను కాపాడారు.

News April 10, 2026

ఆత్మకూరు: రూటు మార్చి అక్రమ రవాణా..!

image

అక్రమ రవాణాదారులు నిషేధిత చికెన్ వ్యర్థాలను బహిరంగంగానే తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెట్టినా అక్రమ రవాణా ఆపడం లేదు. బద్వేల్ నుంచి వస్తున్న వాహనాలు దారి మార్చాయి. హైవేను తప్పించి అనంతసాగరం మండలంలోని పల్లెల మీదుగా రొయ్యల, చేపల గుంటలకు ఈ వ్యర్థాలు తరలిస్తున్నారు.

News April 10, 2026

వరల్డ్ టాప్‌-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

image

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.