News August 5, 2024
అమరావతిలో భూమి సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం

రాజధాని పరిధిలో ప్రతి సెంటు భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామాలు, గ్రామకంఠాల కిందనున్న భూమి తప్ప మిగిలినదంతా తీసుకోనుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని CRDA వర్గాలు స్పష్టంచేశాయి. భవనాలను CRDA స్వాధీనం చేసుకునే అవకాశముంది. భూములపై కోర్టు స్టేలు ఉంటే వాటిని వెకేట్ చేయించి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఇంకా 4,181 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది.
Similar News
News February 24, 2026
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలని తెలిపారు. రానున్న 3 రోజుల్లో ప్రోగ్రెస్ను మరింతగా పెంచేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తూ 100 శాతం పూర్తి చేయాలన్నారు.
News February 24, 2026
గుంటూరు: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ.. నిందితులు వీరే..!

MLA ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు రికవరీ చేశామన్నారు. సత్తెనపల్లి రాకేష్, కొక్కిలిగడ్డ ఆశీర్వాదం దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపై గతంలో 34కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 8మంది నిందితులను గుర్తించి, ఐదుగురిని అరెస్ట్ చేసామన్నారు.
News February 24, 2026
ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను నెలవారీ తనిఖీల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్కు వేసిన తాళాల సీల్, సీసీ కెమెరాల డిస్ప్లే, ప్రాంగణాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


