News March 29, 2025

అమరావతిలో మొదలైన నిర్మాణ పనుల సందడి

image

ఎన్టీఆర్: ఏప్రిల్ 3వ వారంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భవననిర్మాణ సామాగ్రి అమరావతికి తరలి వెళుతోంది. అటు విజయవాడ, గుంటూరు మీదుగా కోర్ క్యాపిటల్ ప్రాంతానికి గుత్తేదారు సంస్థలు యంత్రాలు, కార్మికులను తరలిస్తున్నాయి. ఇటీవలే రూ.37వేల కోట్లపైచిలుకు పనులు చేపట్టేందుకు గుత్తేదార్లకు లెటర్ ఆఫ్ అవార్డ్స్(LOA) అందజేయగా ఆ సంస్థలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తున్నాయి. 

Similar News

News September 16, 2025

విశాఖ పోర్ట్‌ ఛైర్మన్‌ అంగముత్తుకు బదిలీ

image

విశాఖ పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ అంగముత్తు బదిలీ అయ్యారు. ఆయనను ముంబై పోర్ట్‌ ఛైర్మన్‌గా బదిలీ చేస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మేలో ఆయన విశాఖ పోర్ట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం.

News September 16, 2025

కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News September 16, 2025

మెదక్: ‘బాల్యం అనేది చదువుకోవడానికే’

image

బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, భవిష్యత్ నిర్మించుకోవడానికి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.శుభవల్లి అన్నారు. హవేలీ ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అమూల్యమైన దశ, వయస్సులోనే వివాహం జరగడం వలన బాలల ఆరోగ్యం, విద్య అన్ని దెబ్బతింటాయన్నారు. చిన్న వయస్సులో వివాహం జరపొద్దని సూచించారు.