News July 16, 2024
అమరావతిలో ZSI పనులు ప్రారంభం

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.
Similar News
News November 19, 2025
గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News November 18, 2025
Way2News కథనానికి నాగార్జున వర్సిటీ స్పందన

<<18322201>>మాస్టారూ.. ఇదేం క్వశ్చన్ పేపర్?<<>> అంటూ Way2Newsలో మంగళవారం వచ్చిన వార్తకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల సమన్వయకర్త స్పందించారు. బీఈడి, ఎంఈడీ, ఎల్బీబీ, పీజీ సైన్స్, ఆర్ట్స్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటం వల్ల పొరపాటున Msc 3rd సెమిస్టర్ ప్రశ్నాపత్రం రాతపూర్వకంగా వచ్చిందని తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


