News July 16, 2024

అమరావతిలో ZSI పనులు ప్రారంభం

image

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.

Similar News

News November 18, 2025

కృష్ణా: క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్ల నిల్వలు

image

కృష్ణా జిల్లాలో ‘మీ డబ్బు-మీ హక్కు’ పేరుతో క్లెయిమ్ కాని డిపాజిట్లపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ డి.కె. బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 5.59 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సొమ్మును సరైన డిపాజిటర్లకు లేదా వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 18, 2025

కృష్ణా: క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్ల నిల్వలు

image

కృష్ణా జిల్లాలో ‘మీ డబ్బు-మీ హక్కు’ పేరుతో క్లెయిమ్ కాని డిపాజిట్లపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ డి.కె. బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 5.59 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సొమ్మును సరైన డిపాజిటర్లకు లేదా వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 17, 2025

వరకట్న వేధింపులు, మరణాలు అడ్డుకోవాలి: కలెక్టర్

image

వరకట్నం వల్ల జరిగే గృహహింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన తన ఛాంబర్‌లో వరకట్న నిషేధ చట్టం-1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.