News August 25, 2024
అమరావతి నిర్మాణ వ్యయం రూ.60వేల కోట్లు

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 20వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని స్పష్టం చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అన్నారు.
Similar News
News January 24, 2026
ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 496 ప్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
News January 24, 2026
ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
News January 24, 2026
ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.


