News April 3, 2025
అమరావతి: నేటితో మంత్రివర్గ సమావేశం ముగింపు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
Similar News
News April 16, 2025
మే 2న అమరావతికి ప్రధాని మోదీ రాక

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
News April 16, 2025
గుంటూరు: సినిమాలో నటిస్తున్న ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సినిమాలో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న ప్రధాన పాత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా టైటిల్ను ప్రకటించారు. సినిమా పూర్తిస్థాయి కమర్షియల్గా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తామన్నారు. దర్శకులు నరేశ్ దోనే, మణివరణ్ ఉన్నారు.
News April 16, 2025
గుంటూరు జిల్లాకు కొత్త ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా 16 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కే. శ్రీనివాస్ను నియమించారు. సామాజిక న్యాయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ నియామకం కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న శాఖల్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్న డిప్యూటీ కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో సేవలు అందించనున్నారు.