News March 27, 2025
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఊపందుకున్న రియల్ ఎస్టేట్

అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో గజం రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు పలికిన ధర నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పనులు ప్రారంభం కావడంతో గజం రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు పలుకుతుంది. ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేసేవారు కోర్ క్యాపిటల్ ఏరియాలో కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని అదునుగా చూసుకొని రియల్టర్లు అవకాశంగా మలచుకుంటున్నారు.
Similar News
News October 24, 2025
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు ప్రతిపాదనలు: డీఆర్ఓ

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుందని డీఆర్ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి నివేదికను ఎన్నికల సంఘానికి అందించామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని ఆ వివరాలను అందించాలని కోరారు.
News October 24, 2025
అధికారుల నిర్లక్ష్యమా.. లేక విద్యార్థులపై చిన్న చూపా.?

గత 14 నెలలుగా నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక అధికారుల తీరు మారటం లేదు. ఈ నెల 13న MSC కెమిస్ట్రీ 2వ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించిన వర్సిటీ అధికారులు, 23న రీవాల్యుయేషన్కు చివరి తేదీగా పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ చివరి తేదీ ముగిసినా వెబ్సైట్లో నేటికీ మార్కులు పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫలితాలు విడుదల తర్వాత మార్కులు వెబ్సైట్లో పెట్టకపోవడం ఎవరి నిర్లక్ష్యంగా భావించాలి.?
News October 24, 2025
గుంటూరు డీఈవోపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం

గుంటూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించారు. దీంతో డీఈవో రేణుక తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.


