News March 28, 2024

అమలాపురంలో ఇద్దరు వాలంటీర్ల తొలగింపు

image

అమలాపురం రూరల్ మండలం సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావును విధుల నుంచి తొలగించారు. వీరిద్దరూ కామనగరువులో ఈ నెల 27న వైసీపీ నేతలతో కలిసి క్రైస్తవ మత ప్రచారంలో విద్యార్థులకు బైబిల్ పంపిణీలో పాల్గొన్న కారణంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Similar News

News September 18, 2025

పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

image

యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.

News September 18, 2025

రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

image

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.

News September 18, 2025

బయోలాజికల్ కంట్రోల్ లాబరేటరీ పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

image

నిడదవోలులో వ్యవసాయ శాఖ నడుపుతున్న బయోలాజికల్ కంట్రోల్ లాబోరేటరీని బుధవారం జిల్లా వ్యవసాయా ధికారి ఎస్.మాధవరావు సందర్శించారు. లేబోరేటరీ ద్వారా రైతులకు జీవ నియంత్రణ కారాకాలైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమో నాస్ ఫ్లోరిసెన్స్ తదితర జీవ శిలీంద్ర నాశనాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీటి ద్వారా వరి, పొగాకు, అరటి, నిమ్మ కూరగాయలు పంటలకు వచ్చే పొడ తెగులు, కాండం, వేరు కుళ్లు నియంత్రించవచ్చునన్నారు.