News March 28, 2024
అమలాపురంలో ఇద్దరు వాలంటీర్ల తొలగింపు
అమలాపురం రూరల్ మండలం సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావును విధుల నుంచి తొలగించారు. వీరిద్దరూ కామనగరువులో ఈ నెల 27న వైసీపీ నేతలతో కలిసి క్రైస్తవ మత ప్రచారంలో విద్యార్థులకు బైబిల్ పంపిణీలో పాల్గొన్న కారణంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Similar News
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.
News January 14, 2025
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.